సామాజిక పింఛన్లు అందరికీ అందజేస్తామని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇన్ఛార్జ్ కలెక్టర్ ధ్యానచంద్ర హెచ్ఎం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లాలో ఏప్రిల్ నెలకు గాను 2, 71, 477 మందికి విడుదలైన సామాజిక భద్రత పెన్షన్లలో నేడు ఏప్రిల్ మూడవ తేదీ సాయంత్రం 7గంటల వరకు 1, 16, 958మందికి రూ. 35, 40, 64, 000పంపిణీ చేశామని తెలిపారు. మరో రెండు రోజుల్లో దాదాపుగా అందరికీ అందజేస్తామని అన్నారు.