రాపూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ హరినారాయణన్ మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఓటరుకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. వెంకటగిరి నియోజవర్గ రిటర్నింగ్ అధికారి ధ్యాన్చంద్, ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి, సీఐ సుబ్రమణ్యం, తహసీల్దార్ వెంకటరత్నం, ఎస్ఐ మాల్యాద్రి, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిణి సునంద, బీఎల్ఎలు, పాల్గొన్నారు.