అవినీతికి పాల్పడిన వారిని సస్పెండ్ చేయాలి

61చూసినవారు
అవినీతికి పాల్పడిన వారిని సస్పెండ్ చేయాలి
డక్కిలి మండలంలో పొదుపు సంఘాలలో అవినీతికి పాల్పడిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు గద్దెల మునెయ్య అన్నారు. గురువారం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు వినతి పత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ 2016 నుంచి 2023 వరకు 27గ్రామాల్లో ఆర్థిక లావాదేవీలు క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని కోరారు. ఒక్కొక్క రూపాయి దాచుకుని పొదుపు సంఘాలు కట్టుకుంటుంటే వాటిలో కూడా అవినీతి జరిగిందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్