ఏపీలో ఎన్నికల కౌంటింగ్ రోజు సమీపిస్తోంది. జూన్ నాలుగో తేదీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లిన రాజకీయ నేతలు తిరిగొస్తున్నారు. ఈ క్రమంలోనే విదేశీ పర్యటనకు వెళ్లి తిరిగొచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు.. పాలిటిక్స్లో యాక్టివ్ అయ్యారు. పోలింగ్ ముగిసిన తర్వాత రిలాక్సింగ్ మోడ్లో ఉన్న చంద్రబాబు ఇప్పుడు యాక్టివ్ మోడ్లోకి వచ్చేశారు.