AP: వైసీపీ పార్టీ ఉద్యోగులకు రూ.20,637 కోట్ల అలవెన్సులు ఎగ్గొట్టిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కానీ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తాము ఇప్పటికే రూ.7,230 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. త్వరలోనే సౌలభ్యాన్ని బట్టి మిగిలిన బకాయిలను కూడా అకౌంట్లలో జమ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఉద్యోగులు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు.