సీఎం జగన్ అధికార వ్యామోహం కోసమే రాజకీయాల్లోకి వచ్చారు తప్పితే ప్రజలకు మేలు చేసేందుకు కాదని సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు అన్నారు. రాజమండ్రి 7వ డివిజన్లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో వాసు పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలను వివరించారు.