పేకాట శిబిరం పై దాడి... ఎనిమిది మంది అరెస్ట్

82చూసినవారు
పేకాట శిబిరం పై దాడి... ఎనిమిది మంది అరెస్ట్
సీతానగరం మండలంలోని ములకల్లంక శివారులో పేకాటాడుతున్న శిబిరంపై ఎస్సై టి. రామకృష్ణ తమ సిబ్బందితో మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో భాగంగా పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 25, 250 స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరందరూ బొబ్బిల్లంకకు చెందిన వారని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులు హాజరు పరుస్తామని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్