అమలాపురం. ప్రేమ, జాలి దయాగుణం కలిగి జీవించి క్రీస్తు బోధనలు నెరవేర్చాలని అమలాపురం నియోజకవర్గ వైఎస్సార్ సిపి నాయకుడు, గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు కోరారు. అమలాపురంలో బుధవారం నూతనంగా నిర్మించిన హోసన్న ప్రార్థన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రమణారావు పాల్గొని ప్రసంగించారు. క్రీస్తు బోధనలను ప్రతి ఒక్కరూ అనుసరించి ఆత్మీయ ఆశీర్వాదాలు పొందాలని రమణారావు కోరారు.