అనపర్తి మండలం పీరా రామచంద్రపురం లో దొర్లామ్మ తల్లి జాతర తీర్థ మహోత్సవంలో భాగంగా బుధవారం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దొర్లామ్మ అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి పూజలు అనంతరం ఘనంగా సత్కరించారు.