కులాలకు అతీతంగా కార్పెంటర్స్ డే అని నిర్వహించడం జరిగిందని మాజీ డిప్యూటీ మేయర్ ఉదయ్ కుమార్, రాష్ట్ర కార్పెంటర్స్ క్రమశిక్షణ కమిటీ కో చైర్మన్ ఆవుపాటి ఉమాశంకర్ , స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. బుధవారం కాకినాడ జగన్నాధపురం అన్నంగాటి సెంటర్ వద్ద కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్పెంటర్స్ డే నిర్వహించారు.