తాళ్ళరేవు సెబ్ జేవీ భవాని ఆధ్వర్యంలో గురువారం సుంకరపాలెం కూడలిలో వాహనాల తనిఖీ నిర్వహించారు. యానానికి చెందిన వడ్డీ మురళీకృష్ణ 120 మద్యం సీసాలు అక్రమంగా తరలిస్తుండగా తాళరేవు సెబ్ అధికారులు పట్టుకున్నారు. మద్యం సీసాలు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కుమార్ కానిస్టేబుళ్లు సత్యనారాయణ భద్ర రావు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు