బియ్యం దొంగలను వదిలే ప్రసక్తే లేదు

52చూసినవారు
బియ్యం దొంగలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హెచ్చరించారు. గురువారం గంగరాజు నగర్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు అందించే పోషక విలువలు ఉన్న బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తే చొక్కా పట్టుకొని కొయ్యికి వేలాడ దీస్తామని పేర్కొన్నారు. కాకినాడ పోర్ట్ లో న్యాయంగా వ్యాపారం చేసే వారెవరు భయపడనవసరం లేదన్నారు.

సంబంధిత పోస్ట్