బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడలో మంగళవారం నిర్వహించిన రైతు గర్జన సభకు కొత్తపేట నియోజకవర్గం నుండి బిజెపి నేతలు తరలి వెళ్లారు. వైసీపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నించేందుకు సభను ఏర్పాటు చేశారన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గ బీజేపీ నేతలు చేకూరి కృష్ణంరాజు, గండ్రోతు వీరగోవిందరావు, గూడవల్లి రాంబాబు, కుడిపూడి దావీడురాజు తరలివెళ్లారు.