చినకొత్తలంక: శ్రీ మహిషాసుర మర్దిని దేవి అవతారంలో అమ్మవారు

79చూసినవారు
ముమ్మిడివరం మండలంలో దేవి శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం తొమ్మిదవ రోజు సందర్భంగా అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చినకొత్తలంక గ్రామంలో శ్రీ విజయ దుర్గ అమ్మవారినీ నిమ్మకాయల దండలతో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకునీ, పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు.

సంబంధిత పోస్ట్