ముమ్మిడివరంలో ఉత్కంఠగా మారనున్న ఎన్నిక!

1067చూసినవారు
ముమ్మిడివరంలో ఉత్కంఠగా మారనున్న ఎన్నిక!
కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో 1978 నుండి 2019 వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. 5 సార్లు కాంగ్రెస్, 6 సార్లు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి గెలుపొందాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పొన్నాడ వెంకట సతీష్, కూటమి టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, కాంగ్రెస్ నుండి పాలెపు ధర్మారావు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి సంసాని నవీన్ కుమార్ కూడా బరిలో ఉన్నారు. ఎవరికి వారు తమదే గెలుపంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముమ్మిడివరం గెలుపు ఎవరన్నది ఉత్కంఠగా మారనున్నది.

సంబంధిత పోస్ట్