కార్యకర్తలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బౌన్సర్లు

9413చూసినవారు
గొల్లప్రోలు మండలం వన్నెపూడిలోని బుధవారం శ్రీరామనవమి సందర్భంగా రామాలయం నందలి సీతారామ స్వామివారిని దర్శించుకునేందుకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు విచ్చేశారు. ఈ సందర్భంగా నాగబాబును కలుసుకునేందుకు పలువురు స్థానిక జనసేన నాయకులతో పాటు, గ్రామ ప్రజలు ఆలయం వద్దకు చేరుకోగా, ఆయన బౌన్సర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో బౌన్సర్లకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్