గొల్లప్రోలులో ఈబీసీ కాలనీ ప్రాంతంలో సెల్ టవర్ నిర్మాణం చేపడుతున్నారు. ఆ ప్రాంత ప్రజలు శనివారం గొల్లప్రోలు నగర పంచాయతీ అధికారులకు, తహసీల్దార్ కు సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సెల్ టవర్ నిర్మాణం చేపడుతున్న ప్రాంతంలో నివాస గృహాలు ఉన్నాయని దాని వల్ల ఇబ్బందులు జరిగే అవకాశం ఉందని టవర్ నిర్మాణం తక్షణమే నిలిపివేయాలని కోరారు.