ఎంపీ భరత్ అనాలోచిత నిర్ణయాలతో చేపట్టిన పనుల వల్ల వ్యాపారులు ఇబ్బందులు పడ్డారని రాజమండ్రి సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. రాజమండ్రి డీలక్స్ సెంటర్ నుంచి మెయిన్ రోడ్డులోని ఫ్రూట్స్ మార్కెట్ రోడ్డు వరకు శనివారం ఆయన కాలినడకన వెళ్లారు. వ్యాపారులను కలిసి మాట్లాడారు. కూటమి అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు.