ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకునై వెన్నంటి ఉంటానని ఎంపీ, రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి భరత్ అన్నారు. శనివారం రాజమండ్రిలోని 23వ వార్డు గోదావరి గట్టు వద్ద ఉన్న షిరిడీ సాయిబాబా ఆలయం నుంచి వార్డు పర్యటన ప్రారంభించారు. ఇంటింటికి, ప్రతీ దుకాణానికి వెళ్ళి మద్దతు కోరారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రిని ఓ అద్భుత నగరంగా తీర్చిదిద్దుతానని భరత్ హామీ ఇచ్చారు.