సాంఘిక సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలి

82చూసినవారు
సాంఘిక సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఐఎస్ఎఫ్ తూ. గో జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం డిఆర్ఓ జి. నరసింహులుకు పలు రకాల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ హాస్టల్లను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్