కడియం మండలం దుళ్ళ గ్రామంలో వేంచేసిన శ్రీ రుక్మిణి సత్యబామ సమేత మదన గోపాలస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు ఖండవల్లి ముకుంద వాసు ఆచార్యులు, శిశు బృందం ఆధ్వర్యంలో విశేష హోమం, చక్రస్నానం, నిర్వహించారు. గ్రామాల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.