వేమగిరిలో కుళాయిల ద్వారా బురద నీరు సరఫరా

65చూసినవారు
కడియం మండలంలోని వేమగిరి జగనన్న కాలనీలో కుళాయిల ద్వారా శుక్రవారం బురద నీరు సరఫరా జరిగింది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు నిర్లక్ష్యం కారణంగానే బురద నీరు సరఫరా అవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నీటిని ఎలా తాగాలని ప్రశ్నించారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్