ఘనంగా దాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామివారి తెప్పోత్సవం

584చూసినవారు
రామచంద్రపురం మండలం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి కళ్యాణోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన హంస వాహనంపై భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఇక్కడ గల సప్త గోదావరి నదిలో విహరింపజేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ అధికారి టి. తారకేశ్వరరావు పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్