40 మంది మహిళలకు రూపులు పంపిణీ

76చూసినవారు
రంపచోడవరంలో బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమం గురువారం నిర్వహించారు. మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని మహిళలంతా సుఖసంతోషలతో ఈ పండుగను జరుపుకోవాలన్నారు. అనంతరం బంగారు వరలక్ష్మి కానుక డ్రా తీసి 40 మంది విజేతలకు బంగారు లక్ష్మీదేవి రూపులను పంపిణి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్