నాణ్యమైన వైద్య సేవలు అందించండి: ఎమ్మెల్యే

75చూసినవారు
నాణ్యమైన వైద్య సేవలు అందించండి: ఎమ్మెల్యే
వై. రామవరం ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఎమ్మెల్యే శిరీషదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు వైద్య సహాయం ఎలా అందుతుందో అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సిబ్బంది అన్ని వేళలా అందుబాటులో ఉండాలని, రోగులకు అన్ని వైద్య పరీక్షలు ఉచితంగా చేయాలని, నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్