పార్కుకి పోటెత్తిన సందర్శకులు

2226చూసినవారు
తుని పట్నంలోని గణపతి నగర్ లో ఉన్న పొట్టి శ్రీరాములు పార్కుకు సందర్శకులు పోటెత్తారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ పార్కును ఇటీవల మంత్రి శెట్టి రాజా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆదివారం కావడంతో సందర్శకులతో రద్దీ ఏర్పడింది. పిల్లలు పెద్దలు ఆహ్లాదకరంగా గడిపారు. వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సందర్శకులకు బాదం మిల్క్ పంపిణీ చేశారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతకాయల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్