ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 16న ఏలూరు సుఖీభవ ఫంక్షన్ హాల్లో జరగనున్న టీడీపీ దళితుల సదస్సును విజయవంతం చేయాలని జిల్లా టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి బొబ్బర రాజ్ పాల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గురువారం కామవరపుకోట టిడిపి కార్యాలయం వద్ద దళిత ముఖ్య నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.