ఏలూరు జిల్లాలో జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు

81చూసినవారు
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఏలూరు జిల్లాలో జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు చేరింది. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఆదివారం ఉదయం 8: 30 గంటల వరకు హనుమాన్ జంక్షన్ నుంచి ఏలూరుకు వెళ్లే జాతీయ రహదారిపై అధికారులు రాకపోకలు నిలిపివేశారు. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసు అధికారులు యుద్ధ ప్రాతిపదికన ట్రాఫిక్ క్లియర్ చేసి వాహనాలను నెమ్మదిగా పంపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్