పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పెదపాడు మండలం అప్పనవీడు గ్రామంలోని మంగళవారం మదీనా మసీదులో దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో ఏఏంసీ చైర్మన్ అప్పన కనకదుర్గ ప్రసాద్ ఏర్పాటు చేసిన"ఇఫ్తార్ విందు"జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడుతూ, అల్లా ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ముస్లిం సోదరుల ప్రార్థనలతో ప్రపంచానికి మేలు జరగాలని కోరుతున్నట్లు తెలిపారు.