విద్యుత్ శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్ ను అమరావతిలో నరసాపురం ఎమ్మేల్యే బొమ్మిడి నాయకర్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నరసాపురం నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలను తెలియజేసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ విషయమై నాయకర్ మాట్లాడుతూ తను చెప్పిన సమస్యలపై విద్యుత్ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. తొందరలోనే సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు.