నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా జరిగింది. నూజివీడు మండలం దిగవల్లి గ్రామంలో ఆడుదాం ఆంధ్ర
క్రికెట్ పోటీల్లో వివాదం నేపథ్యంలో ఆగిరిపల్లి జట్టు ఈ ధర్నాకు దిగింది.
క్రికెట్ ఎంపైర్ ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని ఆగిరిపల్లి
క్రికెట్ జట్టు సభ్యులు డిమాండ్ చేశారు.