ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని బొత్తప్పగూడెం గ్రామ శివారులో నాటు సారా తయారీ స్థావరాలపై ఎస్సై చంద్రశేఖర్ అధ్వర్యంలో గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో 100 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాటు సారా తయారీకి ఉపయోగించే సుమారు 2000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు.