వరద బాధితులకు ఎమ్మెల్యే సోదరుడి విరాళం

50చూసినవారు
వరద బాధితులకు ఎమ్మెల్యే సోదరుడి విరాళం
విజయవాడ వరద బాధితుల సహాయార్థం పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ సోదరులు సిరి సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆరిమిల్లి వివేక్ రూ. 10లక్షల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా విరాళానికి సంబంధించిన చెక్కును శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్