ఉంగుటూరు తాహసిల్దార్ కార్యాలయంలో ఈనెల 12వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాజకీయ పార్టీ ప్రతినిధులకు అవగాహన సదస్సు జరుగుతుందని ఉంగుటూరు తాహసిల్దార్ శివయ్య గురువారం తెలిపారు. ఉంగుటూరు నియోజవర్గ ఎన్నికల అధికారి, ఏలూరు ఆర్డీవో ఖాజావలి చే అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లపై అవగాహన కల్పిస్తారని తాహసిల్దార్ తెలిపారు.