ఉంగుటూరు మండలంలో విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన పంచాయతీ కార్యదర్శులకు ఉంగుటూరు ఎంపీడీవో పేమన్విత ప్రశంసా పత్రాల్లో అందజేశారని కార్యదర్శిలు శనివారం తెలిపారు. అలాగే మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న కర్రి ముత్యాలకు, గ్రామపంచాయతీ అటెండర్ సత్యనారాయణకు ప్రశంసా పత్రం అందజేశారు. కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.