ఏపీ సీఆర్డీఏ ఆఫీస్ ఎదుట రాజధాని రైతులు, మహిళలు, సీపీఐ నేతలు ఆందోళన చేపట్టారు. అసైన్డ్ రైతులు, భూమి లేని కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు వెంటనే వార్షిక కౌలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ జరిపించాలని కోరారు. కనీసం అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు కూడా పోలీసులు అనుమతివ్వడం లేదని మండిపడ్డారు.