AP: ఓట్ల లెక్కింపు నేపథ్యంలో వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రమంతా వేడుకలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. వైసీపీ విజయం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ఎవరెన్ని అపోహలు క్రియేట్ చేసినా జరగబోయేది ఇదేనని, అందరూ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.