AP: రాష్టంలోని కాంట్రాక్టర్లకు ఉగాది సందర్భంగా కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. కాంట్రాక్టర్లకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వివిధ బిల్లుల చెల్లింపులు చేయనున్నట్లు ప్రకటించింది. గత 3, 4ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నీరు-చెట్టు, పాట్ హోల్ ఫ్రీ రోడ్లు, ఇరిగేషన్, నా బార్డు పనులకు పేమెంట్స్ చేస్తామని మంత్రి పయ్యావుల చెప్పుకొచ్చారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు కోసం కొంత మొత్తం విడుదల చేయనున్నట్లు తెలిపారు.