ఉగాది సందర్భంగా పిఠాపురం ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆత్మీయ లేఖ రాశారు. 'ప్రియమైన నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. నియోజకవర్గంలో అందుబాటులో లేకపోయినప్పటికీ, అనుక్షణం నా పిఠాపురం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాను. మాటలు చెప్పడం కంటే, పని పూర్తి చేయడం ముఖ్యమని నేను భావిస్తాను' అని పవన్ లేఖలో పేర్కొన్నారు.