వైసీపీ అధినాయకత్వంతో తనకి ఎటువంటి విభేదాలు లేవని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ స్పష్టం చేశారు. 2019లో తాను ఓటమి చెందినా జగన్, ఆ పార్టీ అగ్రనాయకత్వం తనను ఎంతగానో ప్రోత్సహించిందని మంగళవారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఇడుపులపాయలో వైసిపి అభ్యర్థులను ప్రకటించే ముందు రోజు కూడా తనను పర్చూరు నుండి పోటీ చేయమంటూ ఆహ్వానం అందిందన్నారు. అయితే చీరాలపై మక్కువతో తాను బయటకు వచ్చేసానని ఆమంచి చెప్పారు.