చంద్రబాబు అమితంగా గౌరవించారు: ఆమంచి

2576చూసినవారు
టిడిపి అధినేత చంద్రబాబు తనకిచ్చిన ప్రాధాన్యాన్ని గౌరవాన్ని తాను జీవితంలో మర్చిపోలేనని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మంగళవారం సభా ముఖంగా ప్రకటించారు. కాంగ్రెస్ లో చేరే నిర్ణయాన్ని వెల్లడించడానికి పందిళ్ళపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను టిడిపి నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాక కూడా చంద్రబాబు తనను పిలిపించుకొని నచ్చచెప్పినా తానే ఆ పార్టీలో ఉండలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్