అక్టోబర్ 2న మాంసం విక్రయించే వారిపై చర్యలు: కమిషనర్

54చూసినవారు
అక్టోబర్ 2న మాంసం విక్రయించే వారిపై చర్యలు: కమిషనర్
అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని గుంటూరు నగరంలో మాంసం విక్రయాలను పూర్తిస్థాయిలో అరికడుతున్నట్లు నగర కమిషనర్ శ్రీనివాసులు సోమవారం తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ సచివాలయాల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మాంసం విక్రయాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. హోటల్స్ నిర్వాహకులు కూడా మాంసాహారాలు విక్రయించకుండా సహకరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్