స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవి

76చూసినవారు
స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవి
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే గళ్లా మాధవి పిలుపునిచ్చారు. స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏటీ అగ్రహారంలోని ఎస్. కె. బియం స్కూల్లో ఉపాధ్యాయులు, టీడీపీ శ్రేణులతో కలిసి మాధవి మొక్కలు నాటారు. ప్రజలంతా భావితరాలను- దృష్టిలో ఉంచుకొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్