సీపీఎం కార్యాలయంలో ఏచూరి సంస్మరణ సభ

64చూసినవారు
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారామ్ ఏచూరి మరణం తమ పార్టీకి తీరని లోటని సీపీఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎయిమ్స్ చికిత్స పొందుతూ ఏచూరి తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏచూరి చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామారావు, అజయ్ కుమార్, మాణిక్య వరప్రసాద్, వినయ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్