శ్రీనగర్, జెండా చెట్టు సెంటర్ లో ఆకస్మికంగా పోలీస్ పికెట్

551చూసినవారు
గుంటూరు నగరంలోని డొంకరోడ్డు, శ్రీనగర్, జెండా చెట్టు సెంటర్ లో మంగళవారం అర్ధరాత్రి ఆకస్మికంగా పోలీస్ పికెట్ ఏర్పాటు కావడంతో ఆ ప్రాంతవాసులు ఆందోళన చెందారు. అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుంది. రంజాన్ పండుగ, ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ తుషార్ ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించినట్లు సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్