వైసీపీ శవరాజకీయాలు తిప్పికొడతాం: గళ్లా మాధవి

84చూసినవారు
వైసీపీ శవరాజకీయాలను ధీటుగా తిప్పికొడతామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి స్పష్టం చేశారు. గుంటూరులో శుక్రవారం ఆమె మాట్లాడారు. బురద జల్లే రాజకీయాలకు జగన్ మరోసారి తెరలేపారని, ప్రజలు జగన్ మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం స్వాతంత్ర్యానికి ముందు కాలం నాటికి వెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ చేసిన అప్పులను కూటమి ప్రభుత్వం తీరుస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్