తాగునీటి సరఫరా చేసిన టీడీపీ నాయకులు

73చూసినవారు
నీటి ఎద్దడి నేపథ్యంలో గురజాల మండలం గంగవరం గ్రామంలో మంగళవారం సాయంత్రం, మండల టీడీపీ ఆధ్వర్యంలో గ్రామంలోని పలు వీధుల్లో ట్రాక్టర్, ట్యాంకర్ ద్వారా తాగునీటి సరఫరా చేశారు. కాగా మండల టీడీపీ అధ్యక్షుడు జి. లక్ష్మీనారాయణ తాగునీటి ట్యాంకర్ను జెండా ఊపి ప్రారంభించారు. గ్రామంలోని ప్రజలు బిందెలతో వచ్చి ట్యాంకర్లోని నీటిని తీసుకెళ్లారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్