మాచర్ల పట్టణంలోని 13వ వార్డులో ఆదివారం రాత్రి టీడీపీ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ శ్రేణులు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పర దాడులలో ఇరు పార్టీలకు చెందిన పలువురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో టీడీపీ బాధితులను జూలకంటి బ్రహ్మారెడ్డి పరామర్శించారు.