భూగర్భ జల మట్టం పెంచటానికి సహకరించండి: ప్రసాద్

69చూసినవారు
భూగర్భ జల మట్టం పెంచటానికి సహకరించండి: ప్రసాద్
రచ్చమల్లపాడు గ్రామంలో వాటర్ ఎయిడ్ ఇండియా ఆధ్వర్యంలో బుధవారం మంచి నీటి ట్యాంకు పనితీరును బ్లాక్ కోఆర్డినేటర్ మాడెబోయిన గురు ప్రసాద్, రవి వర్మలు పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం గురు ప్రసాద్ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. భూగర్భ జల మట్టం పెంచటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గ్రామంలో ఇప్పటికే ఐదు వాన నీటి పరిరక్షణ నిర్మాణాలను నిర్మించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్