ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో విద్యుత్ సంస్థకు రూ. 64. 55 లక్షల నష్టం వాటిల్లినట్లు విద్యుత్శాఖ అధికారులు శుక్రవారం జిల్లా కలెక్టర్కు తెలిపారు. వీటిలో రెండు 33 కేవీ ఫీడర్లు, 11కేవీ ఫీడర్లు 16, 33 కేవీ పోల్స్ ఎనిమిది, 11 కేవీ పోల్స్ 139కు నష్టం జరిగింది. లో టెన్షన్ పోల్స్ 99 పడిపోయాయి. 2. 83 కిలోమీటర్ల మేర విద్యుత్ వైర్లు ధ్వంసమయ్యాయి. 88 ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయి.